ఓటర్ లిస్టును తనిఖీ చేసిన మనుబోలు శ్రీనివాసరావు

తిరువూరు నియోజకవర్గం: ఏ. కొండూరు మండలం, 226, 227, 228, పోలింగ్ బూత్ లలో ఓటర్ లిస్టును నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు తనిఖీ చేసారు. అనంతరం చీమలపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలించి భోంచేసి పేరెంట్స్ తో విద్యార్థులతో ముచ్చటించి వివరాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలోని జనసైనికులు అందరూ మీ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ లలో ఓటర్ లిస్టులు ఉన్నాయి. మన ఓట్లు ఉన్నాయో లేవో వెరిఫై చేసుకోగలరు. అలానే కొత్త ఓట్లు చేర్పించగలరని తెలిపారు.