జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేనలో పలువురి చేరిక

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలంలోని.. వెండ్రం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వం లాంటి నిర్ణయాలునచ్చి గజపతినగరం నియోజకవర్గ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ నాయకత్వంపై భరోసాతో ఆయన సమక్షంలో వై.ఎస్.ఆర్.సీ.పీ మరియు టిడిపి పార్టీకి చెందిన సుమారు 70 మంది జనసేన పార్టీ లో చేరారు.. ఈ కార్యక్రమం వేండ్రం గ్రామం ముఖ్య నాయకులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐదు మండలాల నుంచి నాయకులు పాల్గొన్నారు. రవీంద్ర, నాయుడు, జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాల మోహన్ రావు, మీడతానరవికుమార్, రాజేంద్ర, పండు, శ్రీను, ఆదినారాయణ, మహేష్, హరీష్, సంతోష్, నర్సింగరావు పాల్గొన్నారు.