బూరుగుపూడిలో పలువురు నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వైసీపీకి చెందిన 200 మంది రాష్ట్రంలో, రాజానగరం నియోజకవ్గంలో వైసీపీ పాలన పట్ల, నేతల తీరు పట్ల విసుగుచెంది, విరక్తి కలిగి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆలోచనలు, రాజకీయ లక్ష్యాలు, అలానే రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ అవిశ్రాంతంగా జనసేన పార్టీ ఉన్నతికి శ్రమిస్తున్న తీరు, బడుగు బలహీన వర్గాలకు చేయూతనందిస్తున్న పలు సేవా కార్యక్రమాలు, పేదల పక్షాన పోరాడుతున్న తీరు, వైసిపి అరాచక, అవినీతి, అసమర్థతను ఎండగడుతున్న తీరుకు ఆకర్షితులై బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన నేతలను జనసేన పార్టీలోకి కండువా వేసి సాధారంగా పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసేవిధంగా అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ ఆవ భూముల పోరాట యోధుడు & రాజానగరం నియోజకవర్గం అఖిలపక్షం అధ్యక్షులు అడపా శ్రీనివాస్, మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, బూరుగుపూడి గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.