ముమ్మలనేని సునీల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

నూజివీడు నియోజకవర్గం: నూతన సంవత్సరం 2024లో మన అందరి కష్ట నష్టాలు పోవాలని, రాష్ట్ర భవిష్యత్ బాగుండాలని జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని జనసేనాని ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతూ.. సోమవారం నూజివీడు మండలం, మర్రిగుంట చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో నూజివీడు నియోజకవర్గం జనసేన నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ పాల్గొనడం జరిగింది. అలాగే పలువురు వృద్దులు, వితంతువులు, అభాగ్యులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయడం జరిగింది.