టోర్నమెంట్ నిర్వహణకు మర్రాపు సురేష్ 20 వేల ఆర్ధికసాయం

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ మంగళవారం ఉదయం గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న గజపతినగరం ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా, మంగళవారం కొండకిండాం మరియు మెంటాడ జట్ల మధ్య పోటి జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యఅతిథిగా జనసేన నాయకులు మర్రాపు సురేష్ ముఖ్య అతిధిగా వచ్చి ఇరు జట్లను పరిచయం చేసుకుని, అనంతరం క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు మైదానంలో బ్యాటింగ్ చేసిన అనంతరం ఇరవై వేలరూపాయలు టోర్నమెంట్ నిర్వహించే వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.