మర్రాపు ఆధ్వర్యంలో జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమం
గజపతినగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు, గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో గజపతినగరం మండలం, వేమలి గ్రామంలో జగనన్న కాలనీలను సందర్శించి, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు ఫోటోలు వీడియోలు రూపంలో షేర్ చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ కు మరియు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే న్యాణ్యమైన ఇల్లు నిర్మించి ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు డా.రవి కుమార్ మిడతాన, రాము, మహేష్, అనిల్, ఆదినారాయణ జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-5.32.32-PM-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-5.32.32-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-5.32.33-PM-1024x770.jpeg)