క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన మర్రెడ్డి శ్రీనివాసరావు
పెదపూడి మండలం, ఇటీవల పాముకాటుకు గురైన పెదపూడి మండలం, వేండ్ర గ్రామ జనసేన స్వామిరెడ్డి శ్రీనివాస్ కు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి పంపిన 50.000 వేల రూపాయల చెక్కుని ఆదివారం అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదగా స్వామిరెడ్డి శ్రీనివాస్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి సమన్వయకర్త ఆర్ నాగు, పెదపూడి మండల అధ్యక్షుడు నాగిరెడ్డి వీరస్వామి, వేండ్ర గ్రామ జనసేన వీర మహిళ కోసూరి విజయ, కుమారి, అరుణ్, శ్రీను, వాసు, గణపతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.