వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు

అరకు: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశేఖర్ నేతృత్వంలో, జనసేన పార్టీ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ విజయ్ వర్మ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ సంయుక్త కార్యదర్శి బంగారు రామదాసు మరియు కోన్నేడి లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి సమర్డి రఘునాథ్, నైన సత్తిబాబు గారితో పాటు 30 మంది అనుచరులు జనసేన పార్టీ సిద్ధాంతాలను మెచ్చి జనసేనలో చేరారు. ఈ చేరికలు అరకు నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి ఎంతో దోహదం చేస్తాయని నేతలు అభిప్రాయపడ్డారు. ఆదివాసి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి జనసేన కృషి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆదివాసి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను నేతలు కొనియాడారు. ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం, రహదారుల అభివృద్ధి కోసం జనసేన పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. జనసేన సైనికులు కుల, మత బేధాలను తొలగించి, వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండి, ఆదివాసి హక్కులు, గిరిజన చట్టాలను గౌరవిస్తూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురం ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపు
మార్చి 14న జరిగే పిఠాపురం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయడానికి ప్రతి జనసైనికుడు వాలంటీర్‌గా ముందుండి పాల్గొనాలని కోరారు. రాబోయే రోజుల్లో మరింతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలి అని జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు.

WhatsApp-Image-2025-03-11-at-5.15.44-PM-1-1024x768 వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు

Share this content:

Post Comment