జనసేన పార్టీలోకి భారీ చేరికలు

మచిలీపట్నం: స్థానిక మచిలీపట్నం గొడుగుపేట జనసేన కార్యాలయంలో జనసేన నాయకులు కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి బుధవారం రెల్లి సోదరులు, రాజుపేట వంట మేస్త్రీలు 40 మంది పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా కొరియర్ శ్రీను మాట్లడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ఆ శయాలు రాబొయే రోజుల్లో మరింత ముందుకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో రెల్లి సోదరులు, రాజుపేట వంట మేస్త్రీలు పార్టీలో చేరడం అభినందనీయమని ఆన్నారు. అనంతరం జనసైనికులు మాట్లడుతూ.. రాబొయే రోజుల్లో మచిలిపట్నంలో జనసేన పార్టీని బలోపేతం చెయ్యటమే ద్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.