సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీలో భారీ చేరికలు..

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల పరిధిలోని సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల నుండి 85 కుటుంబాలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.
జనసేన పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి, ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాలలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బొబ్బేపల్లి సురేష్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని, జనసేన పార్టీలో చేరిన వారందరూ సమిష్టిగా పనిచేయాలని, చేరిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మనందరి లక్ష్యమని పిలుపునిచ్చారు. రాబోయే వారం పది రోజుల్లో పొదలకూరు, మనుబోలు మండలాలలో కూడా జనసేన పార్టీలో భారీ చేరికలు ఉంటాయి. జనసేన పార్టీ వైపే యువత మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పిన్నిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, షేక్ రహీమ్, వేణు, రెహమాన్, శ్రావణ్ ,అక్బర్, చిన్న, ఖాజ, శ్రావణ్, తేజ, చరణ్, మోహన్, సలీం, దుర్గా, రాజా, వెంకయ్య, సుధాకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *