చంద్రగిరి జనసేనలోకి భారీ చేరికలు

చంద్రగిరి, పవన్ కళ్యాణ్ భావజాలానికి, జనసేన సిద్దాంతాలకు ఆకర్షితులైన యువకులు జనసేన పార్టీలో చేరారు. బుధవారం స్థానిక పిఎసి కార్యాలయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లుకు చెందిన యువకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్, రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శులు ఆనంద్, దేవర మనోహర్, కలప రవి, సంయుక్త కార్యదర్శి బీగల అరుణ, నగర ఉపాధ్యక్షులు బాబ్జీ, పార్ధు, లక్ష్మి, కొండా రాజా మోహన్, నగర ప్రధాన కార్యదర్శి, రుద్ర కిషోర్, నగర కారుదర్సులు కిరణ్ కుమార్, రవి, పురుషోత్తం రాయల్, హేమంత్, ఐటీ కో ఆర్డినేటర్ పార్థసారథి, సీనియర్ నాయకులు తోట జయంతి, రాజేష్ ఆచారి, రమేష్, గోపి, వంశీ,తిరుపతి అర్బన్ నాయకులు జనసేన సాయి, తిరుపతి రూరల్ నాయకులు రాంబాబు, మనోజ్ కుమార్, గౌస్ బాషా, వీరామహిళలు మధులత, శిరీష, దుర్గ, చందన, జనసైనికులు మోహిత్, బాలాజీ, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.