రాజమండ్రి రూరల్ జనసేనలో భారీ చేరికలు

రాజమండ్రి రూరల్: కడియం గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రాజమండ్రి రూరల్ ఇన్చార్జ్ కందుల దుర్గేశ్ సమక్షంలో దళిత వర్గం నుండి శాక సతీష్ ఆధ్వర్యంలో పలువురు దళిత నాయకులు జాయిన్ అవ్వగా మరియు బీసీ వర్గాల నుండి కేత భులక్ష్మి, గుత్తుల రఘుపతి మరియు గుత్తుల వరలక్ష్మి ఆధ్వర్యంలో పలువురు బీసీ నాయకులు జాయిన్ అయినారు. పార్టీలో జాయిన్ అయిన సభ్యులందరికీ జనసేన పార్టీ కండువాలను వేసి మన నాయకులు కందులు దుర్గేశ్ ఘన స్వాగతం పలికినారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులు బీర ప్రకాష్, వేమన నారాయణ గౌడ్, రత్నం అయ్యప్ప, వైస్ ఎంపీపీ పంతం గణపతి మరియు కలిదిండి గోవింద్, కడియం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ చిలుకూరు నాగేశ్వరావు మర్రి శంకర్ తోరాటి వసంతరావు, కామిశెట్టి వెంకటేష్, కడియం మండల అధ్యక్షులు జమ్మి, కడియపులంక సర్పంచ్ పటంశెట్టి రాంజీ, కట్టా శివ, జేగురుపాడు ఎంపీటీసీ సభ్యులు నాగిరెడ్డి రామకృష్ణ, షేక్ అమీనా బేగం, వేమగిరి పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి రామకృష్ణ, ఆదిమూలం సాయిబాబా, అడపా రాజు, గ్రీన్ ల్యాండ్ బాబి, తమ్మిశెట్టి ప్రసాద్ తోరాటి శ్రీను, జనసైనికులు మరియు జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.