కాకినాడ జనసేనలో భారీ చేరికలు

కాకినాడ గొడరిగుంట జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ స్వగృహం వద్ద జనసేన పార్టీ వలసపాకల గ్రామ అధ్యక్షులు జీని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ, టీడీపీకి చెందిన వారణాసి శ్యామ్, మొరుకుర్తి సత్యనారాయణ మరియు పెంకే వీరబాబు నాయకత్వంలో సుమారు 25 మంది ఆదివారం పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానించారు.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి వైసీపీ, టీడీపీ నుండి జనసేనలో వస్తున్నారని, వీరంతా పార్టీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తూ క్రియశిలక సభ్యులుగా మారతారని తెలిపారు. చేరిన వారు ఈగల మహేష్, కోట శ్రీనివాస్, మాట్టూరి బాబ్జి, బోరడా సాయి, పిల్ల లోకేష్ , చొప్ప దుర్గా, సాయి ప్రసాద్, నరాల రాజేష్, నందు, నందుర్తి బాబ్జి, లంకే గోపి చందు, అభిజిత్ శాండీ, అప్పికొండ వీరబాబు, పాలకూర్తి సోమరాజు తదితరులు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.