కాకినాడ జనసేనలో భారీ చేరికలు

కాకినాడ రూరల్ నియోజకవర్గం, గంగనాపల్లి గ్రామం(ప్రతాప్ నగర్ సెంటర్) మదర్ థెరిసా 113వ జయంతి పురస్కరించుకుని కిల్లాడి ప్రభుదాస్ అధ్వర్యంలో గంగానాపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కుర్రా నాగేశ్వరరావు మరియు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్ సమక్షంలో వైసిపి నుంచి జనసేనలోకి భారీ చేరికలు జరిగాయి. వీరందరికి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ మరియు జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిదింది. ఈ కార్యక్రమంలో గంగనాపల్లి జనసేనపార్టీ గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.