కాకినాడ రూరల్ జనసేనలో భారీ చేరికలు

  • ఇంద్రపాలెం గ్రామం నుండి సుమారు 60 మంది పంతం నానాజీ, పంచకర్ల సందీప్ ల సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు

కాకినాడ రూరల్ నియోజకవర్గం: గంగరాజు నగర్ రోడ్ నెం1 లో గల కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం యువకులు, పెద్దలు జనసేన పార్టీ సిద్దాంతాలు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన – టీడీపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీకి వారి పూర్తి మద్దతు తెలుపుతూ ఇంద్రపాలెం గ్రామ కమిటీ జనసేన పార్టీ నాయకులు అధ్వర్యంలో స్థానిక పెద్దలు బోల్లే భవాని శంకర్ నాయకత్వంలో సుమారు 60 మంది పంతం నానాజీ మరియు జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంచార్జీ డా.పంచకర్ల సందీప్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా వేసి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి, ఇంద్రపాలెం గ్రామ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.