ఏలూరు నియోజకవర్గంలోని శనివారపు పేట నుండి జనసేన పార్టీలోకి భారీ చేరికలు
ఏలూరు, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి జనసేన పార్టీ ముందుకి వెళ్తుందని దానికి నిదర్శనం ఇతర పార్టీల నాయకులు జనసేనలో చేరడమేనని జనసేన పార్టీ ఏలూరు ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి, ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారపు పేటలో మండల ఉపాధ్యక్షులు సుందరనీడి వెంకట దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఇతర పార్టీల నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, కోశాధికారి పైడి లక్ష్మణరావు, మండల ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, వీరమహిళలు కావూరి వాణిశ్రీ, జిల్లెల ప్రియాంక, నాయకులు తేజ, గెడ్డం చైతన్య, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-4.05.33-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-4.05.29-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-4.05.34-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-4.06.01-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-4.06.01-PM-1-1024x461.jpeg)