వైసిపి, టిడిపిల నుండి జనసేన పార్టీలోకి భారీ చేరికలు

కొత్తపేట: ఆలమూరు మండలం, చొప్పెళ్ళ గ్రామంలో బుధవారం కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ నిర్వహించిన జనసేనకు అవకాశం ఇద్దాం.. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం.. ప్రచార కార్యక్రమం అనంతరం సాయంత్రంలో మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్యనారాయణ (సత్య) ఆధ్వర్యంలో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది‌. ఈ సమావేశంలో బండారు శ్రీనివాస్ తో కలిసి మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి, టిడిపి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, యువత ఆయా పార్టీలను వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి అహ్వనించడం జరిగింది. పార్టీలో జాయిన్ అయిన వారు : తోరాటి సత్య కిషోర్ (నాని), పట్టపగలు శ్రీనివాసు తోరాటి వెంకట్రావు, ఆకేటి సాయిక్రిష్ణ, మారుమోను స్వామి కుమార్, ఆకుల స్వామి, పేపకాయల కార్తీక్, దర్మాసుల సతీష్, శివుడు శివ, కాపా పండు, గోర్రుపోతుల స్వామి, ఆకుల బుల్లిసత్యనారాయణ (బుల్లిసత్తియ్య), ఆకుల పెద్దకనకారావు, ఆకుల ఆదినారాయణ, ధర్మాసులు చిన్నకాపు, ఆకుల అశోక్, కొత్తాడ రాజేష్, గానుగుల నాగబాబు‌, గానుగుల అంజిబాబు, తోరాటి నాగబాబు, తోట దుర్గారావు, తోలుం నాగరాజు, వెలిశెట్టి వెంకన్న, దూల్ల భీమశంకరం, పట్లా విశ్వనాథం తదితరులు ఉన్నరు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.