వైసీపీ నుండి జనసేనలో భారీ చేరికలు

పాడేరు: రూరల్ జిల్లా, జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ చేతుల మీదుగా శనివారం కండువా కప్పుకున్నారు, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం శనివారం పంచాయితీ, మాడేం బంద, 2 వీధుల గ్రామస్థుల పిలుపుమేరకు, గ్రామ పర్యటన చేయటం జరింది. వైసీపీ వైఫల్యాలను, అన్నిటిలో వెనకబడిన వర్గాలను, అన్యాయం చేసి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించి తమ పార్టీ మేహర్బానికి న రత్నాల పేరుతో దారి మళ్లించి గ్రామాల అభివృద్ధినీ అడ్డుకున్నారని ఆరోపించారు. 14 15వ ఆర్ధిక సంఘం నిధులు సైతం నొక్కేసి గ్రామ పంచాయితీలకు తీరని ద్రోహం చేసి, గ్రామాల అభివృద్ధికి విఘాతం కలిగించిన ఘనత జగన్ మోహన్ రెడ్డదేనని మండి పడ్డారు, రానున్న ఎన్నికలలో మీరంతా జనసేనని గెలిపించి మీ పిల్లల భవిష్యత్తుకాపాడుకోవాలని, మీ గ్రామాల అభివృద్ధిని చేసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్, నిరుద్యోగులకైన యువత కోసం, గ్రామపంచాయితీలో అభివృద్ధి కోసం స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఉన్నారని, మనమందరం ఆయనకు అండగా ఉండి, గెలిపించుకుఒటే తప్పకుండా మంచిజరుగుతుందని చెప్పారు. గ్రామస్థులు తమగ్రామ సమస్యలను వినతి పత్రంద్వారా సమర్పించారు. తప్పకుండా జనసేన పార్టీనీ గెలిపించుకుఒటామని గెలిచే మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మండల కార్యదర్శి వంతల రాజారావు, సీనియర్ నాయకులు రాజుబబు, వెంకట రమణ, శేఖర్, సాయి పాల్గొన్నారు.