బత్తుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నుండి జనసేనలోకి భారీ చేరికలు

  • వరస చేరికలతో జనసేన పార్టీలో నూతన ఉత్సహం

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, నాగంపల్లి గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో.. వైస్సార్సీపీకి చెందిన 50 కుటుంబాలు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు మరియు బత్తుల బలరామకృష్ణ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటున్న తీరు, జనసేన పార్టీ కోసం కష్టపడుతున్న తీరు నచ్చి.. వైసిపి పాలనపట్ల విసుకుచెంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.. వీరందరికీ జనసేన కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. అనంతరం గ్రామంలో పాదయాత్రలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ జనసేన కరపత్రాలు పంచడం జరిగింది.. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు..