భీమవరంలో వైసిపి నుండి జనసేనలోకి భారీ చేరికలు

భీమవరం నియోజకవర్గం: భీమవరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. భీమవరం మండలం కొత్తపూసలమర్రు గ్రామంలో వైసిపి నాయకులు కొల్లాటి నరసింహస్వామి, గ్రామ ఉపాధ్యక్షుడు బర్రె నాగరాజు, తిరుమాని రాజులు తమ అనుచరులు సుమారు 200 మంది వైసిపి కార్యకర్తలు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. జనసేన పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడిగోవిందరావు, పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్, నర్సాపురం నియోజకవర్గం ఇంఛార్జి బొమ్మిడినాయకర్, రాష్ట్ర పిఎసి సభ్యులు కనకరాజు సూరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల్లచంద్రశేఖర్ చంద్రశేఖర్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.