ధూళిపాల గ్రామంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామంలోని సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం భాగ్యనగర్ కాలనీ వాసులు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా పార్టీలోకి చేరిన చిలక పున్నారావు, బండారు మరియదాసు, చిలకా పెద్ద కోటి, చిలకా చిన్నకోటి, చిలకా కుటుంబరావు, మేకల మల్లేశ్వరి, బండారు సురేష్ బాబు, ఏసు వర్ధన్, బండారు మరియమ్మ, బండారు శ్రీను, పున్నమ్మ, శిరీష ఇతర 50 మంది ఎస్సీ కార్యకర్తలు సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు జనసేన పార్టీ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల సత్తనపల్లి వార్డు కౌన్సిలర్ ప్రోగ్రాం కమిటీ సభ్యులు అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మండల కమిటీ వారు గ్రామ కమిటీ వారు వీరమహిళలు జనసైనికులు పాల్గొనడం జరిగినది.