జనసేనలోకి భారీ వలసలు – ఉప్పాడ మత్స్యకారుల చేరికలు

  • పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికిన మాకినీడి శేషుకుమారి
  • వైసీపీ, టీడీపీల నుంచి పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులమైనందునే పార్టీలో చేరామన్న యవత

కాకినాడ జిల్లా, పిఠాపురం జనసేన పార్టీ ప్రభంజనం సృష్ఠించబోతుందనేది ఖాయం అనిపిస్తుంది. పార్టీలోకి పలువురు చేరికతో రోజు రోజుకు పార్టీ బలం పుంజుకుంటుంది. మంగళవారం ఉప్పాడ గ్రామం బర్మా కాలనీ, రామిశెట్టి పేట గల వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి సుమారుగా 100 మంది ముత్స్యకారులు సూరాడ శ్రీను, మండల అధ్యక్షులు పట్టా శివ ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో జనసేన పార్టీ తీర్దం పుచ్చుకోవడం జరిగింది. వారికి శేషుకుమారి కండువాకప్పి శుభాకాంక్షలు తెయజేసారు. ఎన్నో ఏళ్లగా ముత్సకారులను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని, కాని జనసేన పార్టీ మాముత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న తీరుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్దంతాలు ఆశయసాదనకు ఆకర్షణీయమే పార్టీలో చేరికకు కారణమైయిందని వారు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శేషుకుమారి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఇప్పటికే పలువూరు పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఇక నుండి సీనియర్ నాయకులు సలహా మేరకు గ్రామ కమిటీలు వేసి పార్టీని బలోపెతం చేయడం జరుగుతుందని, గతంలో టీడీపీ పాలన ఇప్పుడు వైసిపి పాలన విధానం విసుగుచెంది జనసేన వైపు మళ్ళుతున్నారని, పంటలు నష్టం వాటిలిన కౌలు రైతును ప్రభుత్వం కన్నెత్తి చూడకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు పవన్ కళ్యాణ్ మనసును కలసివేసిందని, కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి కౌలు రైతుల్ని ఆదుకోవడం జరిగిందన్నారు. జనసేన పార్టీలో చేరిన మత్స్యకారుల తలరాతలు రానున్న రోజుల్లో మార్పుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని, ప్రతిఒక్కరికి ప్రధాన్యత కల్పిస్తుందని హామీచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ మున్సిపల్ చైర్మైన్ కరణం చిన్నారావు, యు.కొత్తపల్లి మండలం అధ్యక్షులు పట్టా శివ, సూరాడ శ్రీను, దొడ్డి దుర్గప్రసాద్, పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి, మాజీ కౌన్సిలర్ కర్రి కాశి, గంగిరెడ్ల సూరిబాబు, యండ్రపు శ్రీనివాస్, సూరాడ ప్రతాప్, మోస రాజు, మోస ప్రసాద్, కొడ నాగరాజు, గంపల నాగబాబు, దాసరి కట్లా రాజు, బొందు చిన్న, వంకా అతమరావు, కరే కాసులు, కొవ్వురి కోదండ మైలపిల్లి రవి, వినుకొండ అమ్మాజి, కసిరెడ్డి నాగేశ్వరరావు, తోట సతీష్, నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.