జనసేన ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా భారత్ తొలి విద్యా శాఖ మంత్రి స్వాతంత్ర సమర యోధులు భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 134వ జయంతి ఘనంగా నిర్వహించారు. 13వ వార్డ్ మున్సిపల్ పాఠశాలలో అమలాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి హారికాస్వామి, గొలకోటి విజయలక్ష్మివాసు, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీను, కార్యదర్శి చిక్కాల సతీష్, సీనియర్ నాయకులు సూదా చిన్న, ఆకుల బుజ్జి, పిండి రాజా, చిక్కం సుధా సూర్యమోహన్, తూము రమేష్, వలవల చిన్న, కారం వెంకటేశ్వరరావు, నామాడి నాగరాజు, పొణకల ప్రకాష్, అరళ్ళపల్లి దుర్గ కరీముల్లా బాబా, మహ్మద్ షరీఫ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.