జనసేన పోరాటంతో కదిలిన యంత్రాంగం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, ములకలపల్లి నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో పొగలపల్లి తిమ్మంపేట మధ్య రోడ్డు అస్తవ్యస్తంగా మారడంతో ఈ సమస్యపై గతంలో జనసేన నాయకులు చేసిన పోరాట ఫలితంగా స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు. ఎట్టకేలకు రోడ్డు మరమ్మతులు ప్రారంభించడం జరిగింది. రోడ్డు మరమ్మతులు జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్పందించి ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను ప్రభుత్వం దృష్టికి అలాగే స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసిన జనసేన నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు అని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారాన్ని కృషి చేసిన జనసేన జిల్లా యువజన నాయకులు గరికే రాంబాబు, విద్యార్థి విభాగం నాయకులు గొల్ల వీరభద్రం, ములకలపల్లి మండల అధ్యక్షులుతాటికొండ ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చిన్నారావు, మండల కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, మండల నాయకులు నాగరాజు నాయక్, నక్కన రమేష్, పాల్వంచ మండల ప్రధాన కార్యదర్శి దేవ గౌడ్ తదితరులకు స్థానిక ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.