బాధిత కుటుంబాలను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, దోసకాయపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మూడు రోజుల క్రితం మహాశివరాత్రి సందర్బంగా పట్టీసీమ తీర్ధానికి వెళ్లిన ఒలేటి అరవింద్, షేక్ లుక్మాన్, పెద్దిరెడ్డి రాంప్రసాద్ వారి స్నేహితులతో గోదావరి నదిలో స్నానం అడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు, చేతికి అందొచ్చిన పిల్లలు కోల్పోయారని బాధలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. అలానే ప్రభుత్వం తక్షణమే బాధితు కుటుంబాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండలం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, కోరుకొండ మండల జనసేన పార్టీ కమిటీ ప్రధాన పోసిబాబు, చదువు ముక్తేశ్వరరావు, దోసకాలపల్లి, చల్లా ప్రసాద్ గ్రామ జనసేన పార్టీ సభ్యులు గళ్ళ అచ్యుతరాయుడు, కందుల సుబ్బారాయుడు, నావేటి ప్రసాద్, కె పవన్ తదితరులు పాల్గొన్నారు.