తామరల రామకృష్ణను కలిసి ధైర్యం చెప్పిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం: సీతారామపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ తమ్ముడు తామరల రామకృష్ణ రెండు రోజులు క్రితం పొలంలో పొడపాము కాటుకు గురై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనే విషయం జనసేనశ్రేణులు ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారిని కలిసి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతారామపురం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ తామరల వరహాలు, రాజానగరం మండల జనసేన పార్టీ నాయకులు చల్లా ప్రసాద్, కామిరెడ్డి పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు.