పెందుర్తి నాగరత్నం కుటుంబ సభ్యులను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ వాస్తవ్యులు మరియు టీడీపీ సీనియర్ నేత పెందుర్తి నాగరత్నం దాదాపు 15 సంవత్సరాలుగా సర్పంచ్ స్థానంలో ఉండి ప్రజలకు సేవలందించడం, స్వర్గస్తులైనారని సీతానగరం మండల జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్య రాజసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ సీతానగరం గ్రామానికి వెళ్ళి నాగరత్నం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్బంగా రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ని మరియు చిట్టూరి రవీంద్రని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం జనసేన పార్టీ కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కతా సత్యనారాయణ, సీతానగరం మండల జనసేన పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి చిడిపి నాగేష్, సీతానగరం మండల నాయకులు అప్పయ్యమ్మా (ప్రసాద్) సీతానగరం మండల కమిటీ సభ్యులు దుబాయ్ శ్రీను, సీతానగరం మండల వీరామహిళ కందికట్ల అరుణకుమారి, సీతానగరం మండల జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.