అతికింశెట్టి శ్రీనివాస్ ను పరామర్శించిన మేడ గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన జనసైనికుడు అతికింశెట్టి శ్రీనివాస్ గత కొన్ని రోజుల క్రితం ఆటో యాక్సిడెంట్లో గాయాల పాలవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వారిని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల కో-కన్వీనర్ ముక్క రాంబాబు, సీతానగరం మండల కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, గేదల సత్తిబాబు, చిక్కాల నాగు, తన్నీరు తాతాజీ, పినిశెట్టి సాయి, వల్లేపల్లి రాజేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.