శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తీర్థ మహోత్సవంలో పాల్గొన్న మేడ గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామానికి చెందిన ప్రసిద్ధ దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి తీర్థం సందర్భంగా మొదటి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు కోరుకొండ మండల జనసైనికులు ఆధ్వర్యంలో ప్రసాదం ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొని ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి కో-ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, కోరుకొండ మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ మండల కమిటీ సభ్యులు పోసి బాబు, కోలా జాన్ ప్రసాద్, కొచ్చర్ల భరత్, కొచ్చర్ల బాబి, ఆకుల ఆదిత్య, రాచపోతుల సురేష్, కోటి, శేషు తదితరులు పాల్గొన్నారు.