మేరీ వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువులు అందించిన మేడిచర్ల హనుమ

రాజోలు నియోజకవర్గం, రామరాజు లంక గ్రామనికి చెందిన మేడిచర్ల హనుమ కు ఆదివారం రెండవ పాప జన్మించిన సందర్భంగా మరియు తన అభిమాన నటుడు మెగాఫ్యామిలీ వారసుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా లక్కవరం గ్రామంలో ఉన్న మేరీ వృద్ధాశ్రమంలో 1500 రూపాయల విలువగల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొదలాడ జనసైనీకుడు పంచదార చినబాబు, అరవ శ్రీనివాసరావు, పిండి నారాయణరావు పాల్గొన్నారు.