రామచంద్రపురం పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం

రామచంద్రపురం రూరల్ మండల జనసేనపార్టీ క్రియాశీలక సభ్యులు, జనసేన నాయకులు, జనసైనికులతో గురువారం రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణం ముచ్చిమిల్లి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి రూరల్ మండల కమిటీలు, గ్రామస్థాయి కమిటీల నిమిత్తము జనసేన నాయకులు జనసైనికులతో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో రామచంద్రపురం రూరల్ మండలం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.