Badvel: ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కి మద్దతుగా “కలసపాడు” మండల విస్తృత సమావేశం

బద్వేల్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా “కలసపాడు” మండల విస్తృత సమావేశం భవనాసి ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కలసపాడు టౌన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ సభ్యులు తాతంశెట్టి నాగేంద్ర, సుంకర శ్రీనివాస్ పాల్గొని మండల నాయకులను సమన్వయ పరచి దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి వివేక్ బాబు, నియోజకవర్గ నాయకులు బసివి రమేష్, తుడిమేళ్ళ మురళి మరియు స్థానిక నాయకులు కావూరి గిరి ప్రసాద్, హరి, ఆంజనేయులు, శ్రీను, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.