రాయదుర్గంలో జనపార్టీ కార్యకర్తల సమావేశం

రాయదుర్గం నియోజకవర్గంలో శనివారం జనపార్టీ కార్యకర్తల సమావేశం జరిగినది, ఈ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరై క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని మీడియా మిత్రులకు వివరించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం ఎవరైతే క్రియాశీలక సభ్యులుగా ఉన్నారో వారు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా .. అలాగే కొత్త సభ్యత్వం తీసుకోలేని వారు కూడా తీసుకోవాలని కోరారు. రెన్యూవల్ చేసుకున్నవారు ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే వారికి 5 లక్షల రూపాయల సహాయం.. అదే విధంగా ప్రమాదాలలో ఎవరైనా గాయపడితే 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు టీ సి వరుణ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.