విజయనగరంలో జనసేన ముఖ్య నాయకుల సమావేశం

విజయనగరం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన జరగబోయే భారీ బైక్ ర్యాలీ సందర్భంగా ఆదివారం విజయనగరం కేంద్ర జనసేన పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో జనసేన మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి పడాల అరుణ, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.