వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరయ్యారు. రిజిస్ర్టేషన్లకు సంబంధించిన అంశాలు, సమస్యలపై చర్చిస్తున్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి సూచనలు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలను మంత్రులు సేకరించనున్నారు. రిజిస్ర్టేషన్ల సమస్యలతో పాటు సలహాలు, సూచనలను ఉపసంఘం స్వీకరించనుంది.