పిట్టపాలెం గ్రామ ఉపాధి కూలీలతో భేటీ: కరిమజ్జి మల్లీశ్వారావు
ఎచ్చెర్ల, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శుక్రవారం నాడు, ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పిట్టపాలెం గ్రామ చేరువులో ప్రజలతో పవన్ రావాలి పాలన మారాలి, మార్పుకోసం ప్రజలను కలిసి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం తప్పిదాలు ప్రజలకు తెలియజేస్తూ అలాగే ఇంతవరకు ఉపాధి కూలీ నగదు ఎకౌంటులో జమ కాలేదు మేము ఎలా బ్రతకగలమని ప్రజలు వాపోయారు. పిట్టపాలెం గ్రామ ప్రజలకు ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని అలాగే జనసేనపార్టీ సిద్దాంతాలను మరియు మేనిఫెస్టో గురించి చెబుతూ ఈసారి జనసేన పార్టీ వచ్చినట్లు అయితే గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, తెల్లరేషన్ కార్డుకు ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, రేషన్ బదులుగా మహిళల ఖాతాల్లో రూపాయలు 2500-3500/- వరకు నగదు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదర్శాలను మరియు ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించితిరి. టిడిపి, వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడ ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు వంటి పవన్ కళ్యాణ్ కి వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలని కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు కోరడమైనది. ఈ కార్యక్రమంలో పిట్టపాలెం గ్రామ పెద్దలు మహిళలు జనసైనుకులు పంపురెడ్డి ఆదినారాయణ, వినయ్, కెల్లా భాషా, పిట్ట గంగులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-13-at-5.10.12-PM-2-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-13-at-5.10.15-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-13-at-5.10.13-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-13-at-5.10.12-PM-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-13-at-5.10.00-PM-1024x462.jpeg)