ద‌ర్శిలోని వృద్ధాశ్ర‌మంలో ఘ‌నంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక‌లు

ద‌ర్శి, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్ర‌హీత‌, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక‌ల‌ను సోమ‌వారం ద‌ర్శి ప‌ట్ట‌ణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా వృద్ధాశ్ర‌మంలో చిరంజీవి అభిమానులు, జ‌న‌సేన నాయ‌కులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వృద్ధుల స‌మ‌క్షంలో కేకు క‌ట్ చేసి, మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు. అనంత‌రం ఆశ్రమానికి 25 కిలోల బియ్యం అంద‌జేశారు. కార్య‌క్రమంలో జన‌సేన పార్టీ ప్ర‌కాశం జిల్లా ప్రోగ్రామ్ క‌మిటీ స‌భ్యులు మ‌రియు ప‌డ‌మ‌ర గంగ‌వ‌రం వార్డు స‌భ్యులు ప‌సుపులేటి చిరంజీవి, ద‌ర్శి ప‌ట్ట‌ణ జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు చాత‌రాశి కొండ‌య్య‌, ద‌ర్శి ప‌ట్ట‌ణ జ‌న‌సేన పార్టీ ఉపాధ్య‌క్షులు షేక్ మ‌స్తాన్‌బాషా, ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ వెంక‌టేష్‌, చెన్నంశెట్టి ప్రసాద్‌, శింగంశెట్టి రామ‌కృష్ణ‌, ఇంగ‌మూరి అంకిరెడ్డి, యాదాల వెంక‌టేష్‌, సందు రాజు, డి.పేర‌య్య త‌దిత‌ర మెగాస్టార్ అభిమానులు మ‌రియు ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ‌ జ‌న‌సైనికులు పాల్గొన్నారు.