తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు.. మేనల్లుడి హెల్త్ ఆప్డేట్ ఇచ్చిన మెగాస్టార్..

మెగా మేనల్లుడు సాయి తేజ్ ఆరోగ్యం గురించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు మెగాస్టార్. చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఈ వార్త తెలియజేశారు.

సాయి తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ ఆశీస్సులు రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందిస్తారని ఆశిస్తూ.. ఆ చిత్రయూనిట్ అందరికి నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన ఎక్సిబిషన్ సెక్టార్‌కి రిపబ్లికి చిత్ర విజయం కోలుకోవడానికి కావాల్సినంత దైర్యం ఇస్తుందని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. అలాగే సంగీత దర్శకుడు తమన్ కూడా ట్విట్టర్ ద్వారా .. అపోలో లో చికిత్స పొందుతున్న సాయి తేజ్ కోలుకుంటున్నాడని.. మన ప్రార్ధనలు ఫలిస్తున్నాయని తెలిపారు.. ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని అన్నారు తమన్. అలాగే త్వరలో తేజ్‌ను కలవనున్నట్టు తెలిపారు తమన్. నా మిత్రుడిని కలవడానికి చాలా ఆసక్తికి ఎదురుచూస్తున్నా.. త్వరలోనే సాయి ని కలుస్తా అంటూ ట్వీటర్ ద్వార తెలిపారు తమన్. ఇక తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాకు దేవకట్ట దర్శకత్వం వహించారు.