శర్వా.. ‘శ్రీకారం’ కోసం మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
దేశానికి వెన్నెముక అయిన రైతుని బతికించాలనే నేపథ్యంలో తెరకెక్కిన శ్రీకారం చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో.. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట రియలిస్టిక్ ఇన్సిడెంట్స్తో నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి.. రైతుల కోసం ఈ చిత్రం రూపొందినట్లుగా టాక్ నడిచింది. ఇక టీజర్లో.. ‘తినేవారు నెత్తిమీద జుట్టుంత.. పండించే వారు మూతి మీద మీసమంత’ అనే డైలాగ్తో ఈ చిత్రం ఏ స్థాయిలో తెరకెక్కిందో అర్థమైంది. అలాగే రీసెంట్గా విడుదలైన ట్రైలర్ అయితే.. రైతు విశిష్టతను.. ఈ చిత్రం సగర్వంగా చాటబోతుందనేది తెలియజేసింది. అందుకే ఈ చిత్రానికి మెగాస్టార్, కేటీఆర్ తమ వంతుగా సపోర్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి మార్చి 8న ఖమ్మంలో జరిగే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుంటే.. మార్చి 9న హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ విషయం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా విడుదల కానుంది.