కేసీఆర్ బర్త్ డే కు మెగాస్టార్ మెగా గిఫ్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 17 న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ కోటి వృక్షార్చన పేరుతో కేసీఆర్‌ పుట్టినరోజైన ఫిబ్రవరి 17న ఒకే రోజు కోటి మొక్కలు నాటేలా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ సపోర్ట్ చేస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు , అనసూయ మొదలగు వారు సపోర్ట్ తెలుపుగా.. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఈ కార్యక్రమానికి సపోర్ట్ అందిస్తూ.. అందరూ ఈ కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటాలని కోరుతూ ఓ వీడియోని విడుదల చేశారు.

”తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆకాంక్ష, కోరిక. దాని కోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి, మొక్కలు నాటుదాం.. మన ముఖ్యమంత్రిగారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం, వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందాం..” అని పేర్కొన్నారు.