గురుకులం నందు మెగాస్టార్, పవర్ స్టార్ ల జన్మదిన వేడుకలు

  • అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో మాధవ గురుకులం నందు మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

మెగాస్టార్ పద్మభూషణ్ డా. చిరంజీవి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున మంగళవారం అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మణ కుటాల మాట్లాడుతూ.. కదిరి పట్టణంలో ఉన్న మాధవ గురుకులం నందు ఉన్న నిరాశ్రిత పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటుగా భోజనం చెయ్యడానికి స్టీల్ ప్లేట్లు లేవని మాధవ గురుకుల నిర్వాహకులు మన టీమ్ సభ్యులకు తెలపడంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పంపిణీ చెయ్యడం జరిగింది. స్వయం కృషికి, పట్టుదలకు, మంచి మనస్సుకు నిలువెత్తు నిదర్శనం, ఆపదలో ఎంతో మందిని ఆదుకున్న ఆపద్బాంధవుడు, మెగా అభిమానుల ఆరాధ్య దైవం, కోట్లాది మంది మెగా అభిమానుల రారాజు అన్నయ్య చిరంజీవి గారు మరియు దేశప్రగతికి, దేశ అభివృద్ధికి నేటి బాలలే రేపటి పౌరులు అని భావించి వారి అభ్యున్నతి కోసం శ్రమించే అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో , సుఖ సంతోషాలతో జీవించాలని ఆ శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఆ కుటుంబంపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మణ కుటాల తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, నాగరాజు, రాజేంద్ర, కృష్ణ కాంత్, రియాజ్, మల్లెం మోహన్, హరి బాబు, గొందిపళ్లి రవి కుమార్, రాజ, హరీష్, సురేష్, కార్తిక్, చిన్నా రెడ్డి, విష్ణు, దేవలం కార్తిక్, పెద్ది రెడ్డి, జగన్ రెడ్డి తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.