నర్సంపేట ఏసిపికి వినతి సమర్పించిన మేరుగు శివకోటి యాదవ్

తెలంగాణ, నర్సంపేట ఏసిపి పుప్పాల తిరుమల్ ని నర్సంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గౌరవపూర్వకంగా కలిసి త్వరలో నిర్వహించే జనంతో జనసేన కార్యక్రమానికి అనుమతి కోరడం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ దిశగా ఈనెల అక్టోబర్ 9వ తేదీ సోమవారం నుంచి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న 6 ప్రధాన మండలాల కేంద్రాల వారిగా జనసేన పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించే “జనంతో జనసేన ప్రచార కార్యక్రమానికి” నర్సంపేట ఏసిపి పి.తిరుమల్ ని ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి అనుమతి కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ తిరుమల్ ప్రజా యాత్ర చేపడుతున్న శివకోటి యాదవ్ కు శుభాశీస్సులు తెలిపి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జ్ శివకోటి యాదవ్ ఏసిపితో మాట్లాడి తమ జనసేన కార్యక్రమాలకు నర్సంపేట డివిజన్ పోలీసు వారి మద్దతు తప్పకుండా ఉండాలని కోరి, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం జరిగింది.