అనిల్ కుమార్ దేశ్ ముఖ్ ను పరామర్శించిన మేరుగు శివకోటి యాదవ్

మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, అయ్యగారి పల్లి గ్రామంలో అన్యాయాన్ని ప్రశ్నించినందుకు జనసైనికుడు అనిల్ కుమార్ దేశ్ ముఖ్ పై అధికార పార్టీ గ్రామ సర్పంచ్ మరియు అతని అనుచరుల యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన నాయకులు మేరుగు శివకోటి యాదవ్ అన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం తగదు. అనిల్, అనిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కి శివకోటి యాదవ్ వివరణ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎస్సైతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకొని, అనిల్ అధైర్యపడవద్దని తనకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని ధైర్య రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ మరియు రాష్ట్ర నాయకులు సంపత్ నాయక్ చెప్పడం జరిగింది. అనిల్ ని పరామర్శించిన వారిలో జిల్లా నాయకులు ఓర్సు రాజేందర్, డోర్నకల్ నియోజకవర్గ జనసైనికులు అడిదల సాగర్, గణేష్, సాయి, సంతోష్ తదితరులు ఉన్నారు.