మినీ ట్యాంక్ బండ్ పనులు వెంటనే పూర్తి చెయ్యాలి.. తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్: పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను వెంటనే పూర్తి చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం చెరువు కట్టను సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ఆరు ఏడు సంవత్సరాలుగా నిర్మిస్తున్నా పనులు పూర్తి కాలేదన్నారు. బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు మాత్రమే మెరుగులు దిద్ది వదిలేస్తున్నారు. ఇటీవలే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు గాలికి వదిలేశారు. తూతూ మంత్రంగా చెరువు కట్టపై మట్టి పోయడంతో బీటలు వారి పగుళ్లు ఏర్పడ్డాయి అన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోని మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షులు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షులు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వొద్దమల్ల విజయ్, తోడేటి సంపత్, సెక్రటరీ తగరపు సందీప్, మోరె శ్రీకాంత్, నేవూరి పవన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.