తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం ఉదయం పల్లె వీధి, ఎల్లపురెడ్డి కాలనీలల్లో లబ్ధిదారులకు పెన్షన్ లను పంపిణీ చేశారు. నగరంలో 18,714 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 21లక్షల 47వేల రూపాయలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లను ప్రతి నెలా ఒకటవ తేదీ ప్రభుత్వం ఇస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్దిదారులకు పెంచిన పెన్షన్ లను ఎన్డీఎ కూటమి ప్రభుత్వం వస్తుందన్నారు. గత ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలకు పెంచేందుకు ఐదేళ్లు తీసుకుందని ఆయన ఆరోపించారు. లబ్ధిదారులకు ఇచ్చిన పెన్షన్ కన్నా గత ప్రభుత్వం పబ్లిసిటీకి పెట్టిన ఖర్చే ఎక్కువన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ముందున్నారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత సీఎం, డిప్యూటీ సీఎంలు ఇస్తున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం అనేది లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి, బిజెపి, ముఖ్య నేతలు మరియు కార్పొరేటర్లు, కూటమి పార్టీల కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment