8వ తరగతి విద్యార్థి జె.ఇసాక్ కు ఎమ్మెల్యే భరోసా..!

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, కోడుమూరు జనసేన పార్టీ సమన్వయకర్త ఆకెపోగు రాంబాబు కోడుమూరు పట్టణంలో ఎస్సీ బాలుర వసతి గృహంలో సీనియర్ విద్యార్థి చేత వేధింపబడ్డ 8వ తరగతి విద్యార్థి జె.ఇసాక్ ను ఓదార్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ విద్యార్థిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్థిని ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంటుకి ఎమ్మెల్యే ఫోన్ చేసి మంచి వైద్యం అందించాలని వారి తెలియజేయడం జరిగింది. ఆ తల్లిదండ్రుల కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది.

Share this content:

Post Comment