ఎమ్మెల్యే బత్తుల చేతుల మీదుగా శ్రీవాణి ట్రస్ట్ చెక్కు అందజేత

రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం సింగవరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రామాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవాణి ట్రస్ట్ నుంచి మంజూరైన రూ.3,01,627 విలువైన చెక్కును ఆలయ కమిటీకి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామ కూటమి నాయకుల సమక్షంలో నిర్వహించబడింది. చెక్కు అందజేసే కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సంప్రదాయపూర్వకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

Share this content:

Post Comment