రాజానగరం మండలం ఫరిజల్లిపేట గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గురువారం పరామర్శనకు వెళ్లారు. పరామర్శలో బాగంగా ప్రముఖ వైద్యులు పూడి సత్యనారాయణ మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, పూడి సత్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం నిడదవోలు పెద్ద సత్య రాజ్ మృతి నేపథ్యంలో, వారి పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment