రాజానగరంలో పలువురికి ఎమ్మెల్యే బత్తుల పరామర్శ

రాజానగరం మండలం రాజానగరం గ్రామంలో అనారోగ్యంతో ఉన్నవారిని మరియు శోకసంద్రంలో ఉన్న కుటుంబాలను రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గురువారం పరామర్శించారు. కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి సుబ్బారావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం తోట జానకిరామయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి, ఎమ్మెల్యే వారిని కూడా పరామర్శించి, ఆరోగ్యంపై ఆసక్తి చూపుతూ మెరుగైన వైద్యం కోసం ప్రోత్సహించారు. అనంతరం దుర్గాపు నూకరాజు సతీమణి శ్రీమతి దుర్గాపు ధనలక్ష్మి గారు ఇటీవల పరమపదించిన నేపథ్యంలో, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధనలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment