రాజనగరం నియోజకవర్గంలోని కొత్తవెలుగుబంద గ్రామంలో ఇటీవల ప్రమాదాలకు గురైన యువకులను ఆదివారం రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మరియు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. గ్రామానికి చెందిన యువకుడు చిట్టిబాబు బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆయనను నేరుగా కలుసుకొని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన కాళ్ల రమేష్ కూడా బండి ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకొని, ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధితులకు సంఘీభావం తెలుపుతూ, అవసరమైన సహాయం అందించాలని స్థానిక ప్రజలు కోరారు.

Share this content:
Post Comment